రాష్ట్రంలో 40 మంది టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

-

తెలంగాణలో 2022 సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు మొత్తం 40 మంది ఎంపికయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాళ్ల విభాగంలో 10 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌/ పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్ల విభాగంలో 19 మంది, ఎస్‌జీటీ/టీజీటీలకు సంబంధించి 10 మంది, అధ్యాపకులు/సీనియర్‌ అధ్యాపకుల విభాగంలో ఒకరిని ఎంపిక చేశారు.

వీరితో పాటు ప్రత్యేక విభాగంలో మరో 10 మందికి పురస్కారం వరించింది. వీరందరికి ఈనెల 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పురస్కారాలను అందజేస్తారు. విభాగాల వారీగా ఎంపికైన వారి వివరాలివి.

Read more RELATED
Recommended to you

Latest news