తెలంగాణ ప్రభుత్వ టీచర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై అలా చేయాల్సిందే !

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ టీచర్లకు బిగ్ అలర్ట్. ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయిన టెట్ దరఖాస్తుల స్వీకరణ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. అయితే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు అప్లై చేసుకునే ప్రభుత్వ టీచర్లు కచ్చితంగా విద్యా శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. లేదంటే నిబంధనలు ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తామని తెలిపారు.

కాగా ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎం లుగా పదోన్నతి పొందాలంటే టెట్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అందుకే చాలామంది ప్రభుత్వ టీచర్లు ఇప్పుడు టెట్ పరీక్ష రాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు కొత్త రూల్ అమలు చేస్తోంది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news