తెలంగాణలో జనసేనకు 12 సీట్లు కేటాయించిన బీజేపీ !

-

 

తెలంగాణలో బిజెపితో జనసేన పొత్తు కుదిరింది. ఈ తరుణంలోనే.. జనసేన కు కొన్ని సీట్లు కేటాయించనుంది బిజెపి పార్టీ. ఈ మేరకు ఇవాళ బిజెపి తొలి జాబితా విడుదల చేయనుంది. 55 మందితో బిజెపి లిస్ట్ రిలీజ్‌ చేయనున్నారు. తొలి జాబితాలో ముగ్గురు ఎంపిలు ఉంటారట. పెండింగ్ లో అంబర్ పేట, ముషీరా బాద్ నియోజక వర్గాలు ఉండనున్నాయి.

అటు తెలంగాణలో జనసేనకు బీజేపీ 12 సీ ట్లు కేటాయించింది. వైరా, మధిర, ఖమ్మం, కొత్తగూడెం, అశ్వారావుపేట, పాలేరు, సత్తుపల్లి, యెల్లందు, కూకట్‌పల్లి, నక్రేకల్‌, కోదాడ, పాలకుర్తిలను జనసేనకు కేటాయించారు. అటు గజ్వేల్, హుజూరాబాద్ లో పోటీ చేయనున్నారు ఈటల రాజేందర్. ఈ మేరకు బిజెపి ఎంపీ లక్ష్మణ్ ప్రకటన చేశారు. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపిక పై బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని.. తెలంగాణ నుంచి 50 పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి అందించామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news