Telangana : ఉపాధ్యాయ MLC ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

-

తెలంగాణలో శాసన మండలిలో త్వరలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో ఒకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. తన అభ్యర్థిగా వెంకట నారాయణరెడ్డిని బరిలో దింపుతున్నట్లు తెలిపింది.

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ఎన్నికైన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం ఈ ఏడాది మార్చి 29న ముగియనుంది. మార్చి 13న ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలోనే బీజేపీ హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news