తెలంగాణలో బీజేపీ జోరు.. 9 స్థానాల్లో ఆధిక్యం

-

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన లెక్కింపులో బీజేపీ జోరు సాగిస్తోంది. ప్రస్తుతం ఈ పార్టీ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆదిలాబాద్‌లో ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌ 8,852 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, నిజామాబాద్‌లో ఎంపీ అభ్యర్థి అర్వింద్‌.. మరోవైపు సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఆధిక్యంలో జోరు సాగిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌లో 25,957 ఓట్ల ఆధిక్యంలో డీకే అరుణ కొనసాగుతున్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్ ముందంజలో కొనసాగుతున్నారు. నాగర్‌కర్నూల్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మెదక్ నియోజకవర్గాల్లోనూ బీజేపీ ముందంజలో ఉంది. ఇలాగే ఈ ఫలితాలు సాగితే బీజేపీ డబుల్ డిజిట్ సాధించడం ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news