సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సవాల్..!

-

తెలంగాణలో మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో ఓ వైపు కాంగ్రెస్.. మరోవైపు బీఆర్ఎస్.. ఇంకో వైపు బీజేపీ ఇలా ఎవ్వరికీ వారు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. బీజేపీ ఏకంగా 17కి 17 సీట్లను గెలుచుకుంటామనే ధీమాలో ఉంటే.. కాంగ్రెస్ మాత్రం 14 సీట్లు గెలువబోతున్నామని పేర్కొంటోంది. బీఆర్ఎస్ కూడా 10 నుంచి 12 సీట్లు గెలిస్తే.. కేంద్రంలో చక్రం తిప్పొచ్చని ధీమాలో ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 14 సీట్లు తెప్పిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. ఒకవేళ 14 ఎంపీ సీట్లు రాకపోతే సీఎం సీటు వదులకుంటారా..? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 10 ఎంపీకి పైగా సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భూ కబ్జాలు, సెటిల్ మెంట్ల కోసమే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని ఆరోపించారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news