రాష్ట్రాన్ని దోచుకుతిన్న కల్వకుంట్ల కుటుంబానికి బీజేపీ అండగా నిలిచింది – వై.ఎస్ షర్మిల

-

ఢిల్లీ దాకా కేసీఆర్ అవినీతి పాకిందని చెబుతున్న బీజేపీకి.. కేంద్రంలో అధికారం పెట్టుకొని చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అవినీతి కేసీఅర్ ను అరెస్ట్ చేయడానికి మనసు రాదేందుకన్నారు. మోడీ, కేసీఅర్ ను కేడి అంటే.. మోడీని బోడి అని కేసీఅర్ అంటాడని.. నువ్వు కొట్టినట్లు చెయ్యి, నేను పడ్డట్లు ఏడుస్త ఇదే ఇద్దరి మద్య రహస్య ఒప్పందం అని ఆరోపించారు.

“మోడీ గారు.. కేసీఅర్ అవినీతిపై మీ దగ్గర ఇంత సమాచారం ఉంటే.. ఇన్నాళ్లు ఎందుకు విచారణ జరిపించలేదు బీజేపీకి, బీఆర్‌ఎస్ బీ టీం కాకపోతే కేసీఅర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు ? కేసీఅర్ ది అత్యంత అవినీతి ప్రభుత్వం అయితే తక్షణ దర్యాప్తుకి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు..? మాయల పకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్లు కేసీఅర్ అవినీతి చిట్టా మీ దగ్గరుంది. మీకు నచ్చినట్లు కేసీఅర్ ను ఆడిస్తుంటే, మీరు చెప్పినట్లు కేసీఅర్ ఆడుతున్నాడు. కాళేశ్వరం అవినీతిపై సాక్ష్యాధారాలు మీ చేతుల్లో పెట్టుకొని యాక్షన్ తీసుకోక పోవడం మీ రహస్య బంధానికి ప్రతీక.

లిక్కర్ స్కాంపై దూకుడు పెంచిన దర్యాప్తు సంస్థలు.. కేసీఅర్ బిడ్డ కవిత ప్రధాన సూత్రదారి అని తెలిసి.. ఒక్కసారిగా సైలెంట్ అవ్వడం మీ దోస్తానాలో భాగం.TSPSC స్కాంపై కేంద్రం వేసిన ఈడీ విచారణలో ఐటీ మంత్రి లోపమే అని తెలిసి పట్టింపు లేకపోవడం మీరు మీరు ఒక్కటే అనడానికి నిదర్శనం. రాష్ట్రాన్ని దోచుకు తిన్న కల్వకుంట్ల కుటుంబానికి బీజేపీనే అండా దండ .”పైకి సిగపట్లు, లోపల చప్పట్లు” ఇదే రెండు పార్టీల దొంగ రాజకీయం.

నిజంగా కేసీఅర్ తెలంగాణ బిడ్డనే అయితే, బీజేపీతో వైరమే ఉంటే.. మోడీ రాష్ట్రానికి వస్తే ఎందుకు మొహం చాటేస్తున్నట్లు..? ప్రధానికి ఎదుటపడి ఎందుకు ప్రశ్నించనట్లు? విభజన హామీలపై అమితుమి అంటూ ఎందుకు పట్టుబట్టడం లేదు ? బయ్యారం ఉక్కు పరిశ్రమ ,గిరిజన యూనివర్సిటీ,కేంద్రం ఇచ్చే ఉద్యోగాలు లాంటి విషయాల్లో ఎందుకు కేంద్రంపై దండయాత్ర సిద్ధ పడటం లేదు ? బీజేపీ బీఆర్‌ఎస్ లు రెండు వేర్వేరు పార్టీలు కాదు. రెండు పార్టీలు కలిసి ” బీజేపీ రాష్ట్ర సమితి ” రాజకీయాన్ని నడుపుతున్నయ్” అని సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news