ఖమ్మంలో బీజేపీ గెలవడం పెద్ద కష్టమేమి కాదు.. ఎంపీ రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఖమ్మంలో బీజేపీ గెలవడం పెద్ద కష్టమేమి కాదు.. ఎంపీ రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో  సీపీఐ పై హాట్ కామెంట్స్ చేసారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఖమ్మం లో ఎలిసిపోయిన ఎర్రజెండా వాళ్ళు ఉన్నారు.  ఏలిసిపోయిన ఎర్ర జెండా వాళ్ళు ఒకరి సహాయం లేకుండా గెలవ లేరు. ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకోకపోతే ఎర్రజెండా కి 10 ఏళ్లు స్థానమే లేదు. మొన్న ఎవరితోనో పొత్తు పెట్టుకుంటే లింగు లీటుకుమంటూ ఒకటి గేలిచిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాట్లాడితే పోరాటం చేస్తున్నామని.. ఆటో యూనియన్ మాదే, ఊడ్చే యూనియన్ మాదే..  ఇంకా ఏమైనా యూనియన్లు అంటే అవి కూడా మాయే అంటారు.  ఆఖరికి సింగరేణి లో కూడా మా యూనియన్ మరి గెలుస్తున్నరా..? ఎన్ని రోజులు అయింది ఖమ్మం లో కమ్యూనిస్టు పార్టీ గెలిసి ఇప్పుడు మనం కూర్చున్న గడ్డ (కొత్తగూడెం) ఎవరో దయ దక్షిణలతో గెలిచింది. వాళ్ళు అంతట వాళ్ళు నిలుచుంటే ఖమ్మంలో ఎర్ర జెండా కి అడ్రస్ లేదని ఈ జిల్లా ప్రజలు ఎప్పుడో చెప్పారని ఎంపీ రఘునందన్ రావు సెన్షేషనల్ కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news