బీజేపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న : ఈటల రాజేందర్

-

బీజేపీకి ఓటు వేసిన ప్రతిఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. కీసర హోలిమేరి కాలేజీ వద్ద ఏర్పాటుచేసిన కౌంటింగ్ సెంటర్లో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు ఈటల రాజేందర్. మీ విశ్వాసానికి తగ్గట్టు పని విధానం ఉంటుంది. మాకు రెండు కర్తవ్యాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం కొట్లాడతాం. మోదీ గారి ప్రభుత్వం నుండి రాష్ట్రానికి నిధులు తెస్తాం. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం. 17 సీట్లలో 8 సీట్లు గెలిచి ఆధిపత్యం కొనసాగిస్తున్నాం.

ఇది ప్రజల ఆశీర్వాదం. దేశంలో 300 సీట్ల పైగా సీట్లతో దేశంలో మూడోసారి మోదీగారు అధికారంలోకి రాబోతున్నారు. స్వేచ్ఛ స్వతంతం – ప్రగతి ఆత్మగౌరవం కోసం బీజేపీకి ఓటు వేశారు. మోదీగారు ఈ పదేళ్లలో పేదవారికి డబ్బున్న వారికి ఉన్న అంతరాలు తగ్గించారు. యువతకి ఉద్యోగ అవకాశాలు కలిపించారు. మౌలిక వసతులు ఏర్పాటు చేసారు. భారత ఆత్మగౌరవం పెంచారు. మోదీ హయాంలో బాంబుల మోతలు లేవు. నేను మల్కాజగిరి స్థానికుడిని.  నామీద విశ్వాసం ఉంచి గెలిపించారు
ఏ రౌండ్ లో మేజారిటీ తగ్గకుండా ఓట్లు వేశారు. కంటోన్మెంట్ రోడ్స్, చెరువుల పునరుద్ధరణ, యువతకు ఉపాధి, పేదలకు ఇళ్ళు, ఇండస్ట్రియల్ కారిడార్, అన్ని నెరవేరుస్తానని.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా.  నాకు సహకరించిన అన్ని సంఘాలకి కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news