బ్రేకింగ్: మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్

-

తెలంగాణాలో ప్రజాప్రతినిధులను కరోనా కంగారు పెడుతూనే ఉంది. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం మంత్రి సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఆయనకు కరోనా లక్షణాలు లేకుండా వచ్చింది అని, అయితే కాస్త నీరసంగా ఉండటంతో కరోనా పరిక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఆయనతో పాటుగా ఆయన ఇంట్లో కొంత మందికి కరోనా సోకినట్టు తెలుస్తుంది. ఇటీవల మంత్రి సిఎం కేసీఆర్ తో జరిగిన కేబినేట్ భేటీ లో పాల్గొన్నారు. దీనితో ఇప్పుడు ఆయనను కలిసిన మంత్రులు, ఇతర అధికారులు కూడా కంగారు పడుతున్నారు. వారు అందరూ కరోనా పరిక్షలు చేయించుకునే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం నిలకడగానే ఉంది అని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news