మోడీకి, రేవంత్ రెడ్డి కి భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదు : కేటీఆర్

-

మోడీకి, రేవంత్ రెడ్డి కి భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదు అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్. ఇవాళ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు కేటీఆర్. పార్టీ కమిటీ లు కూడా పూర్తిగా వేయక పోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరిగింది ..ఇక ముందు ఆలా జరగదు. మూడు నెలలకొకసారి అన్ని కమిటీల సమావేశం నిర్వహించుకుందాం. గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవు అన్నారు.

కారు కేవలం సర్వీసింగ్ కు వెళ్ళింది ..మళ్ళీ రెట్టింపు వేగం తో పరుగెత్తుతుంది. కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారు ..కార్యకర్తలు అధైర్య పడొద్దు. పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా ఉంటుంది. ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణ ఏకైక గొంతుక బీఆర్ఎస్ అన్నారు. పార్లమెంటులో తెలంగాణ సమస్య ల మీద పోరాడిన చరిత్ర బీఆర్ఎస్ దే.. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఢిల్లీ లో తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్ గెలవాలి అన్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ గొంతుక బీఆర్ఎస్ ను ఖతం చేయాలని చూస్తున్నాయి.

బండి సంజయ్ వ్యాఖ్యలు చూసినా ఈ రోజు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు చుసినా అదే విషయం రుజువు అవుతుంది. ఇటీవల మోడీ ని రేవంత్, భట్టి కలిసినపుడు ఆయన బీఆర్ఎస్ ను ఫినిష్ చేసేందుకు పూర్తిగా సహకరిస్తాను అన్నారట ..ఇది రాధాకృష్ణ చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ టీం కాదు ..బీజేపీ కాంగ్రెస్ లు ఒక్కటేనని స్పష్టంగా తెలియడం లేదా అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news