BRS సర్కార్ తాగుడుకే ప్రిఫరెన్స్ ఇస్తుంది – బండి సంజయ్

-

రాష్ట్ర ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నిజాం కాలేజీలో “ఖేలో భారత్.. జీతో భాగ్యనగర్” పేరుతో క్రీడలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు క్రికెట్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అక్కడికి వచ్చారు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిఆర్ఎస్ సర్కార్ తాగుడుకే ప్రిఫరెన్స్ ఇస్తుందని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై ఇప్పటికీ కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

ఈ ప్రభుత్వానికి రైతుల ఘోష కనిపించడం లేదా..? అని నిలదీశారు. ఇక్కడి రైతులను ఆదుకోవడం లేదు కానీ.. పంజాబ్ రైతులకు మాత్రం పైసలు ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రానికి మరోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం దివాలా తీస్తుందన్నారు బండి సంజయ్. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కెసిఆర్ ఏ డబ్బులు పంపిస్తున్నాడని ఆరోపించారు. బిజెపికి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news