మైనంపల్లి హనుమంతరావుపై సీఎం కేసీఆర్ వేటు ?

-

మైనంపల్లి హనుమంతరావుపై బిఆర్ఎస్ పార్టీ చర్యలకు సిద్ధమౌవుతోంది. నిన్న మంత్రి హరీష్ రావు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మైనంపల్లిపై వేటు వేసేందుకు నిర్ణయం తీసుకుంది బీఆర్‌ఎస్‌ పార్టీ. దీంతో ఏ క్షణమైన మైనంపల్లిపై క్రమశిక్షణ చర్యలపై బిఆర్ఎస్ నిర్ణయం ప్రకటించే అవకాశం స్పష్టం గా కనిపిస్తోంది.

ఇక అటు మంత్రి హ‌రీశ్‌రావుపై మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు వ్యాఖ్య‌ల‌ను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. తన కుటుంబ సభ్యునికి టికెట్ నిరాకరించిన మన ఎమ్మెల్యే ఒకరు మంత్రి హరీష్ రావుపై కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. మేము అందరం హ‌రీశ్‌రావు వెంట ఉంటాం.. ఆయ‌న‌కు అండ‌గా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్. పార్టీ ఆవిర్భావం నుంచి హ‌రీశ్‌రావు ఉన్నారు. హ‌రీశ్‌రావు బీఆర్ఎస్ లో మూల‌స్తంభంగా కొన‌సాగుతారని పేర్కొన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news