హైదరాబాద్ వాసులకు అలర్ట్..రేపు MMTS రైళ్ల రద్దు

-

హైదరాబాద్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్. రేపు హైదరాబాద్ మహానగరంలో నడిచే ఎంఎంటిఎస్ రైలు రద్దు కానున్నాయి. నిర్వహణ పనుల కారణంగా ఈనెల 10వ తేదీన అంటే రేపు కొన్ని ఎంఎంటీఎస్ రైలను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

లింగంపల్లి టు హైదరాబాద్ మార్గంలో 9 రైళ్లను రద్దు చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ టు లింగంపల్లి 9 రైళ్లు, ఫలక్ నూమా టు లింగంపల్లి ఏడు రైళ్లు, లింగంపల్లి టు ఫలక్నామ 7 రైళ్లు, సికింద్రాబాద్ టు లింగంపల్లి మార్గంలో ఒకటి మరియు లింగంపల్లి టు సికింద్రాబాద్ మార్గంలో ఒక రైలు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తమ ప్రకటన ను అర్థం చేసుకొని హైదరాబాద్ ప్రయాణికులు తమ ప్రయణాలను ఇతర మార్గాల ద్వారా చేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news