కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులను రోడ్డున పడేసింది – మంత్రి హరీష్ రావు

-

కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా చేనేత కార్మికులను రోడ్డున పడేసిందని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. కిషన్ రెడ్డి సూటిగా అడుగుతున్నా.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తేలంగాణకు కేంద్ర ప్రభుత్వం తరుపున చేనేత రంగం కార్మికులకు ఏం చేసింది? అని ప్రశ్నించారు. దీనికి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్పాలన్నారు.

చేనేత రంగం మీద ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని సీఎం హామీ ఇచ్చారని.. నల్లగొండ జిల్లా బోధన్ పోచం పల్లి , సిరిసిల్ల ల్లో అనాడు ఆత్మ హత్యలకు పాల్పడిన కుటుంబాలకు యాబై లక్షలు అందించామన్నారు. చేనేత రంగం కార్మికులకు ప్రభుత్వం తరుపున అనేక రకాల చేయూతను ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. 350కోట్ల రూపాయల నిధులతో బతుకమ్మ చీరలకు ఆర్డర్ ను చేనేత కార్మికులకు ఇచ్చామన్నారు మంత్రి హరీష్ రావు.నేతన్నలు భీమా, మరమగ్గాల కు సబ్సిడి లాంటి అవకాశాలు ఇస్తున్నామన్నారు.

కొండ లక్ష్మన్ బాపూజీ అంటే చేనేత కార్మికులకు రోల్ మాడల్ అన్నారు. అప్పటి పాలకులు కొండ లక్ష్మన్ బాపూజీ ని అవమానిస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సముచిత స్థానం కల్పించామన్నారు. 1250ఎకరాల్లో మెగా టెక్స్ట్ టైల్ పార్క్ వరంగల్ లో ఏర్పాటు చేశామని.. ఇతర రాష్ట్రాల కు వలస వెళ్తున్న నేతన్న కార్మికులకు ఇక్కడే బరోసా ఇచ్చామన్నారు. ఆల్ ఇండియా హ్యాండీ క్రాఫ్ట్ బోర్డు , పవర్ లుమ్ బోర్డులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. 2014 లో తీసుకొచ్చిన త్రీఫ్ట్స్ ఫండ్ పథకం కూడా రద్దు చేసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news