కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కు కోట్లు వేశారు… కానీ ఏం మారలేదు..!

-

ప్రపంచంలోనే బీజేపీ అత్యధిక సభ్యులు ఉన్న పార్టీ బీజేపీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో సభ్యత్వ నమోదు జరుగుతుంది. మహిళలు , రైతులు, యువత టార్గెట్ గా సభ్యత్వం జరగాలి. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వర్గాలు బీజేపీ కి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు అని కిషన్ రెడ్డి తెలిపారు. BRS పోయి కాంగ్రెస్ వచ్చిన తెలంగాణ పెద్దగా మార్పు రాలేదు. ప్రజలు ఈ రెండు పార్టీల పట్ల విసిగి పోయి ఉన్నారు.

కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారు తెలంగాణ ప్రజలు తెలివిలేనోళ్ళు అనే విధంగా కేసీఆర్ కుటుంబం భావిస్తుంది… తమ అహంకారంతో ఓడి పోయామని అనుకోవడం లేదు. అయితే కేసీఆర్ మీద కోపం తో గ్యారంటీ లు నమ్మి కాంగ్రెస్ కు ప్రజలు ఓటు వేశారు అని అన్నారు. అలాగే శాసనసభ కు ఎప్పుడు ఎన్నికలు జరిగిన పార్టీ గెలిచే విధంగా ముందుకు వెళతాం. పార్టీ ఫిరాయింపులను అప్పుడు BRS ప్రోత్సహిస్తే… ఇప్పుడు ఆ పని కాంగ్రెస్ ఆ పని చేస్తుంది అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news