రంగారెడ్డి జిల్లాలో గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి

-

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధి బాబుల్‌రెడ్డి నగర్‌లో దారుణం జరిగింది. పాత గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది.  ఘటనలో గాయపడిన ఇద్దరు చిన్నారులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి సెలవులు కావడంతో రంగారెడ్డి జిల్లాలోని బాబుల్రెడ్డి నగర్లో ఈరోజు ఉదయం నలుగురు చిన్నారులు ఆడుకుంటున్నారు. అయితే నిన్న భారీగా వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్పటికే శిథిలావస్థలో ఉన్న పాత గోడ ఇవాళ ఉదయం అక్కడే ఆడుకుంటున్న చిన్నారులపై కూలింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వర్షాకాలంలో పురాతన ఇళ్లు, గోడలతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news