క్లౌడ్ బర్స్ట్ ఎయిర్ బేస్ గజ్వేల్ లో పెట్టాడా – కెసిఆర్ పై కొండా ఫైర్

-

ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి ఏదో వచ్చిందని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక ఏవో కుట్రలు ఉన్నాయని చెబుతున్నారన్న సీఎం.. ఎంతవరకు కరెక్టో తెలియదని చెప్పారు. ఇతర దేశాల వాళ్ళు కావాలనే మనదేశంలో అక్కడక్కడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.

అయితే సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు. క్లౌడ్ బరెస్ట్ అనేది చాలా పెద్ద విషయమని, సీఎం దీనిపై ఇంకా వివరంగా మాట్లాడితే బాగుంటుందన్నారు. కొంచెం చెప్పి ఊరుకుంటే అందరూ నవ్వుతున్నారు అని అన్నారు.

సీఎం ని చూసి నవ్వుకుంటే మాకు కూడా అవమానమే అని అన్నారు. అంతేకాదు క్లౌడ్ బరెస్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. 50 హెలికాప్టర్లు క్లౌడ్ సీడింగ్ చేస్తే తప్ప అంత క్లౌడ్ బరెస్ట్ కాదన్నారు. ఎయిర్ బేస్ గజ్వేల్ లో పెట్టాడా అంటూ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news