BREAKING : తెలంగాణ సీఎం కేసీఆర్ కు సర్జరీ

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు శస్త్రచికిత్స జరిగింది. సీఎం కేసీఆర్ కంటికి సోమవారం ఢిల్లీలో శస్త్రచికిత్స జరిగినట్లు సమాచారం అందుతోంది.

కొద్ది రోజులుగా తీవ్ర పంటి నొప్పి తో ఇబ్బంది పడుతున్న సీఎం కేసీఆర్… పరీక్షల నిమిత్తం ఆదివారం రోజున ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఆయనకు శస్త్రచికిత్స చేసినట్లు సమాచారం. అయితే ఈ శస్త్రచికిత్సలో సీఎం కేసీఆర్ ఓ పంటిని… తొలగించినట్లు కూడా తెలుస్తోంది. మరో నాలుగు రోజుల పాటు సీఎం కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

పది రోజుల కింద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు..  గుండెకు సంబంధించిన సమస్యలతో యశోద హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే.  ఇది ఇలా ఉండగా.. ధాన్యం కొనుగోలు విషయంలో… కేంద్రం, టిఆర్ఎస్ పార్టీ మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే.  ఈ వివాదం నేపథ్యంలోనే ఆదివారం సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి నట్లు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news