ఇవాళ పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నంలో సీఎం కేసీఆర్ సభలు

-

ఎన్నికలకు ఏ మాత్రం సమయం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండో విడత ప్రచారాన్ని ప్రారంభిచారు. నిన్నటి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచారం మొదలు అయింది. ఇందులో భాగంగా నిన్న అశ్వరావుపేట, పినపాక, భద్రాచలం మరియు నర్సంపేటలో ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మొత్తంగా 16 రోజులపాటు ఆయన రెండో విడత ప్రచారంలో పాల్గొంటారు. ఈ 16 రోజులలో 54 నియోజకవర్గాలలో సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారన్నమాట.ఇక ఇవాళ పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నంలో సీఎం కేసీఆర్ సభలు ఉంటాయి.

ఈనెల 28వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలో బహిరంగ సభతో తన ప్రచారాన్ని ముగిస్తారు. అంతకుముందు మొదటి విడత ప్రచారంలో దాదాపు 74 నియోజకవర్గాలలో సీఎం కేసీఆర్ ప్రచారం చేశారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి మాత్రం సీఎం కేసీఆర్ ప్రచారాలు చేస్తున్నారు. కాదా సీఎం కేసీఆర్ కామారెడ్డి మరియు గజ్వేల్ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 30వ తేదీన తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news