BREAKING : 15,660 డబుల్ బెడ్ రూమ్‌ ఇండ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్

-

ఆసియాలోనే అతిపెద్ద 15,660 డబుల్ బెడ్ రూమ్‌ల గృహ సముదాయాన్ని కొల్లూరులో ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూం లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందించారు కేసీఆర్. 15,660 డబుల్ బెడ్ రూమ్‌ల గృహ సముదాయాన్ని కొల్లూరులో ప్రారంభించడం పట్ల.. లబ్ది దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, రంగారెడ్డి జిల్లా కొండకల్ వద్ద మేధా గ్రూపు నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని CM KCR ఇవాళ ప్రారంభించనున్నారు. రూ. 1,000 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,200 మందికి ఉపాధి లభించనుంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఇది ఒకటి. 150 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఫ్యాక్టరీకి… ఏటా 500 కోచ్ లు, 50 లోకో మోటవ్ లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version