ఇవాళ హుస్నాబాద్ కు సీఎం కేసీఆర్…యుద్ధ భూమిలోకి దిగుతున్న గులాబీ బాస్

-

ఇవాళ్టి నుంచి సీఎం కేసీఆర్‌ ఎన్నికల యుద్ధ భూమిలోకి అడుగపెట్టనున్నారు. హుస్నాబాద్‌ లో మొదటి ఎన్నికల ప్రచార సభ లో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్‌. అటు ఇవాళ మధ్యాహ్నం 12:15 గంటలకు బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో ప్రకటించనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే..ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకుంటారు. ఈ సందర్భంగా అభ్యర్థులు, నియోజకవర్గాల ఇంఛార్జిలతో సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్‌.

Husnabad sentiment to CM KCR
Husnabad sentiment to CM KCR

అనంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్‌ కేసీఆర్‌. ఆ తరువాత అభ్యర్థులకు బి ఫారాలు అందచేయనున్నారు కేసీఆర్. తదనంతరం BRS మ్యానిఫెస్టో విడుదల చేస్తారు సీఎం కేసీఆర్. BRS మేనిఫెస్టోలో.. మహిళలకు పెద్దపీట వేసే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో హుస్నాబాద్ బయలుదేరుతారు. ఈ సందర్భంగా హుస్నాబాద్‌ లో మొదటి ఎన్నికల ప్రచార సభ లో పాల్గొననున్న కేసీఆర్… అనంతరం ప్రగతి భవన్‌ కు తిరిగి వస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news