తెలంగాణ ఎన్నికలు…ఇవాళ హెలికాప్టర్ లో సిద్దిపేటకు సీఎం కేసీఆర్

-

ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం సిద్దిపేట జిల్లాకు సీఎం కేసీఆర్ ప్రయాణం కాలున్నారు. సీఎం కేసీఆర్ స్వగ్రామం అయిన చింతమడకలో ఓటు హక్కును ఆయన వినియోగించుకోనున్నారు.

CM KCR went to Siddipet in a helicopter today
CM KCR went to Siddipet in a helicopter today

ఈ నేపథ్యంలో ప్రత్యేక హెలికాప్టర్లో కుటుంబ సమేతంగా చింతమడకకు వెళ్ళనున్నారు సీఎం కేసీఆర్. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అటు రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దం ఐంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తారు అధికారులు. తెలంగాణలో మొత్తం 119 నియోజక వర్గాలకు పోలింగ్ జరుగనుంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news