నేడొక్కరోజే సీఎం కేసీఆర్‌ మూడు బహిరంగ సభలు

-

CM KCR  : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు తరుమకొస్తున్న వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెలరోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో గులాబీ పార్టీ మాత్రం తమ ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రచారంలో కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీల కంటే ఒక అడుగు ముందు గులాబీ పార్టీ. దానికి తగ్గట్టుగా గులాబీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తి, ఆలేరు సభల్లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.50 గంటలకు కోదాడ, 3.10కు తుంగతుర్తి, 4.10కు ఆలేరు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. ఈ నెల 31న హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news