నేడు కేరళకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

-

రాష్ట్ర పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఇమేజ్‌ భారీగా పెరిగింది. అందుకే ఆయన ఛరిష్మాను లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం భావించింది. అందుకే ఆయనతో తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ ఇవాళ కేరళకు వెళ్లనున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఈరోజు కేరళ చేరుకుంటారు. అక్కడ లోక్సభ ఎన్నికల ప్రచారంలో రెండ్రోజుల పాటు పాల్గొంటారు, కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తారు.

తిరిగి ఈనెల 18వ తేదీ రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక 19వ తేదీన మహబూబ్నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో జరిగే కాంగ్రెస్ సభల్లో పాల్గొంటారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో రేవంత్తో అధిష్ఠానం ప్రచారం చేయించింది. ఇక ఇప్పుడు ఏపీ, కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలోనూ రేవంత్తో ప్రచారం చేయిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news