యాదాద్రి అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

-

యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తిరుమల వెంకన్న ఆలయం స్థాయిలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నారు రేవంత్ రెడ్డి. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

యాదగిరిగుట్ట పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని, ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వైటిడిఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి స్టేటస్ రిపోర్ట్ తనకు అందించాలని అధికారులకు సూచించారు. ఏపీలో తిరుమల ఆలయానికి టీటీడీ బోర్డు ఉన్నట్లుగా.. తెలంగాణలో యాదాద్రి కి టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్.

ఏకో, టెంపుల్ టూరిజం అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీటితోపాటు హెల్త్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. హైదరాబాద్ బయట మారో జూ పార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి ఉన్న వనరుల అభివృద్ధికి అవసరమైన చోట పీపీపీ విధానాన్ని అవలంబించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news