ఎమ్మెల్సీ పదవులకు కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ రాజీనామా..!

-

కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మ శ్రీ ఒకేసారి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసారు. మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజుకు తమ రాజీనామా లేఖలు సమర్పించారు ఈ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు. అయితే ఇప్పటికే పోతులు సునీత రాజీనామా చేసిన విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరితో మొత్తం ముగ్గురు ఎమ్మెల్సీల రాజీనామా జరిగింది. అయితే ఎమ్మెల్యే కోటా నుంచి కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. అదే సమయంలో గవర్నర్ కోటా నుంచి కర్రి పద్మ శ్రీ ఎమ్మెల్సీగా ఎన్నికైంది.

అయితే 2027 సంవత్సరం వరకు కళ్యాణ్ చక్రవర్తి పదవీ కాలం ఉంది. 2029 సంవత్సరం వరకు కర్రి పద్మ శ్రీ పదవీ కాలం ఉంది. ఇక మొత్తం ముగ్గురు సభ్యుల రాజీనామాతో మండలిలో 28 కి పడిపోయింది వైసీపీ సంఖ్యాబలం. అయితే ప్రస్తుతం రాజీనామా బాటలో మరింత మంది వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news