ప్రజల గుండెల్లో జయశంకర్‌ చిరస్థాయిగా నిలిచిపోతారు : సీఎం రేవంత్‌

-

తెలంగాణ జాతిపిత, సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి (జూన్‌ 21వ తేదీ)ని పురస్కరించుకొని సీఎం రేవంత్‌ రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా జీవించిన మహానుభావుడు జయశంకర్‌ అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొనియాడారు.

సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు.. జనాన్ని జాగృతం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారని రేవంత్ తెలిపారు. తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని గుర్తు చేసుకున్నారు. తన జీవితాన్ని మొత్తం రాష్ట్రానికి ధారపోశారని.. అన్ని రంగాల్లో తెలంగాణకు ఉన్న ఉజ్వల భవిష్యత్తును వీక్షించిన స్వాప్నికుడు జయశంకర్‌  అని రేవంత్‌రెడ్డి కొనియాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్వగ్రామం అక్కంపేటని రెవెన్యూ గ్రామంగా ప్రకటించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news