ఎల్లుండి ఢిల్లీకీ సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నట్టు ప్రకటించారు. తాజాగా రుణమాఫీ చేసిన అనంతరం  రైతులతో కాన్పరెన్స్ లో మాట్లాడారు. పలువురు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరంగల్ కి చెందిన రైతు ఎల్లయ్యతో మాట్లాడారు. రాహుల్ గాంధీతో లక్షలాది మందితో సభ నిర్వహిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రబుత్వం 2014లో హామీ ఇచ్చినప్పటికీ అది నెరవేర్చలేదు.

మరోసారి 2019లో కూడా అదే మోసం చేసింది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు సోనియాగాందీ. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఎన్ని సవాళ్లు ఎదురైనా రైతుల కోసం రుణమాఫీ చేశామని తెలిపారు. కాంగ్రెస్ మాట ఇస్తే.. అది శిలాశాసనం అని తెలిపారు. ఎల్లుండి ఢిల్లీకి వెళ్లి రుణమాఫీ గురించి రాహుల్ గాంధీతో చర్చిస్తాను. త్వరలోనే వరంగల్ లో భారీ బహిరంగ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నా జీవితంలో ఇది మరుపు రాని రోజు అన్నారు రేవంత్ రెడ్డి. రైతు డిక్లరేషన్ లో చెప్పినట్టుగానే రుణమాఫీ అమలు చేస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news