రేపు నుమాయిష్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

-

హైదరాబాద్లో ప్రతి ఏటా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ప్రదర్శన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జనవరి 1వ తేదీ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నుమాయిష్ ప్రారంభం కానుంది. 45 రోజులపాటు జరగనున్న ఈ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ను సోమవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎగ్జిబిషన్‌ను లక్షల మంది ప్రజలు సందర్శిస్తారని తెలిపారు. సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ఎంతో చరిత్ర ఉందన్న మంత్రి.. ఈసారి 2,400పైచిలుకు ఎగ్జిబిటర్లు వస్తున్నారని చెప్పారు. దేశంలో ప్రతి రాష్ట్రం నుంచి ఎగ్జిబిటర్లు వస్తున్నారని.. తొలిసారిగా శాఖాహారం రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అపోలో యాజమాన్యం కూడా ఓ క్లీనిక్ ఏర్పాటు చేస్తోందని.. సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news