సీఎం రేవంత్ రెడ్డి మైక్ వీరుడు.. కేటీఆర్ సెటైర్..!

-

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మైక్ వీరుడు మాత్రమే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించారని ఎద్దేవా చేశారు. మేం అధికారంలో ఉన్నప్పుడే ఫార్మా సిటీ కోసం అన్నీ సిద్ధం చేశాం.. అది కూడా నడపడం చేతకాని అసమర్థులు కాంగ్రెస్ నేతలు అని మండిపడ్డారు.

రాష్ట్రానికి పరిశ్రమలు వస్తేనే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోందని.. కాంగ్రెస్ సర్కార్కు ఆ తెలివి కూడా తెలియకపోతే రియల్ ఎస్టేట్ రంగం పడిపోతుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ కరెంట్ కోతలు, నీటి కష్టాలు వచ్చాయన్నారు. ఈ సారి కేంద్రంలో కాంగ్రెస్ కైనా, బీజేపీకి అయినా స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని కేటీఆర్ జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news