మూసీ పరివాహకంలో పర్యాటకంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

-

మూసీ పరీవాహక ప్రాంతాన్ని పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. సీఎం సచివాలయంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మహానగరంలో మూసి నది ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి వరకు మూసి నది పరీవాహక ప్రాంతాన్ని ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మూసీ నదీ వెంట బ్రిడ్జిలు, కమర్షియల్, షాపింగ్ కాంప్లెక్సులు, అమ్యూజ్ మెంట్ పార్కులు, హాకర్ జోన్ లు, పాత్-వేలను ప్రభుత్వ, ప్రైవేటు పార్ట్నర్ షిప్ విధానంలో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. మరోవైపు మూసీ నదిలో కాలుష్యాన్ని తగ్గించి, మురుగు నీరు ప్రవహించకుండా అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. మూసీలో శుద్ధి చేసిన నీరు ప్రవహించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు తగు నీటి మట్టం ఉండేలా చెక్ డ్యామ్​లు నిర్మించాలని ఈ సమీక్షా సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news