సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా MSME నూతన పాలసీ విడుదల

-

హైదరాబాద్‌‌లోని శిల్ప కళా వేదికలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నూతన విధానం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. ఎంఎస్‌ఎంఈ నూతన పాలసీని సీఎం రేవంత్‌ రెడ్డి తాజాగా విడుదల చేశారు.ఈ పాలసీ విడుదల కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు  పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణకు వీలుగా పరిశ్రమల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించిన విషయం విధితమే.

అమెరికాలో వ్యాపార అవకాశాలు అన్నీ మన రాష్ట్రంలోనే ఉన్నాయని.. చైనాకు ప్రత్యామ్నయంగా ఎదగాలనే సంకల్పంతో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ఈ తరుణంలో రాష్ట్రంలో కొత్తగా ఆరు విధానాలను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. పారిశ్రామిక అభివృద్ధికి MSME పాలసీ ఎగుమతి విధానం, న్యూ లైఫ్ సైన్సేస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ అనే ఆరు కొత్త పాలసీలను ఖరారు చేయాలని గత సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు. 

Read more RELATED
Recommended to you

Latest news