స్వాగతాభిమానం కురిపించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.. సీఎం ఆసక్తికర ట్వీట్..!

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియగానే అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఇవాళ విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణకు చేరుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డికి శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్దకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు డప్పు చప్పుల్లతో స్వాగతం పలికారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఓ స్పెషల్ ట్వీట్ చేశారు.

మన బిడ్డల కొలువుల కోసం…మన రాష్ట్రానికి పరిశ్రమల కోసం…ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ బ్రాండింగ్ కోసం…అమెరికా, దక్షిణ కొరియాలలో పది రోజుల పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన సందర్భంగా వెల్లువలా తరలివచ్చి ఘన స్వాగతాభిమానం కురిపించిన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.  తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఈ నెల 3న సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, అధికారుల బృందం విదేశీ పర్యటనకు వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news