మహిళలకు ఫ్రీ జర్నీ.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్..!

-

తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మొన్న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం రోజే 6 గ్యారెంటీ స్కీమ్ లపై తొలి సంతకం, దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం కల్పించడం పై రెండో సంతకం చేసి అందరి మన్ననలు పొందారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ వారికి ఇవాళ అధికారికంగా శాఖలను కేటాయించారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. తిరిగి అసెంబ్లీని ఈనెల 14కి వాయిదా వేశారు.

మహాలక్ష్మీ స్కీమ్, ఆరోగ్య శ్రీ కింద రూ.5లక్షలను రూ.10లక్షల వరకు పెంపు వంటి రెండు గ్యారెంటీలను అమలు చేశారు రేవంత్ రెడ్డి. తాజాగా మహిళలకు ఫ్రీ జర్నీ గురించి ఓ ట్వీట్ చేశారు. తెలంగాణ ఆడబిడ్డ మోమోలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం. అందులో భాగంగానే నేడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. సంక్షేమానికి ఇది మొదటి అడుగు అని ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిని పలువురు ప్రశంసిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news