BREAKING: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు !

-

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయింది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ రేపటి వాయిదా పడింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

Another Rs. 16000 crore debt of Revanth Reddy government

కాగా, ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లోనే దాదాపు 10 సార్లకుపైగా ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఇలా ఉండగా,తెలంగాణ రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావటంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, అందుకు సరిపడే విద్యుత్తును అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. డిమాండ్ కు సరిపడేంత విద్యుత్తు అందుబాటులో ఉందని, కరెంటు పోయిందనే ఫిర్యాదు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news