నేడు దిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం (జులై 21వ తేదీ) దిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే శనివారం సాయంత్రం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిల్లీ వెళ్లారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు దిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లను కలువనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు ఈ నేతలు దిల్లీలోనే మకాం వేయనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు గురించి పార్టీ పెద్దలకు వివరించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా ఈనెల 23వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో సోమవారం తిరిగి వీరు హైదరాబాద్కు రానున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఈనెల 25వ తేదీన బడ్జెట్ సమావేశాలు ఉన్నందున దిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news