మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

-

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియానే మంత్రి వర్గ విస్తరణ చేపట్టింది.. వాయిదా వేసిందని ఫన్నీ కామెంట్స్ చేశారు. తాను ఎప్పుడూ డేట్ చెప్పలేదన్నారు. ఈ నెల 7తో తాను పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లయిందని.. ఈ నేపథ్యంలోనే వేరే వారికి అవకాశం ఇవ్వాలని ఏఐసీసీని కోరానన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుందో టార్చి లైట్ వేసి వెతకాల్సిన పరిస్థితి ఉందని సెటైర్లు వేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఆ పార్టీకి రాలేదన్నారు.

ఆ పార్టీకి గతం తప్పా.. భవిష్యత్ లేదన్నారు. ఈ నెల 4న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం గత వారం రోజులుగా జోరుగా సాగింది. అయితే.. ఏకాభిప్రాయం రాకపోవడంతో విస్తరణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. మంచి రోజులు లేకపోవడం సైతం మరో కారణంగా తెలుస్తోంది. శ్రావణ మాసంలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news