మల్కాజిగిరిలో మంచితనానికి, రౌడీయిజానికి మధ్య పోటీ : మంత్రి హరీశ్ రావు

-

మల్కాజిగిరిలో మంచితనానికి, రౌడీయిజానికి మధ్య పోటీ జరుగుతుందని.. మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇవాళ మల్కాజిగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. టిఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు పై పలు విమర్శలు చేశారు హరీష్ రావు. మైనంపల్లి పైసల మైనాన్ని ఓటుతో కరిగించాలని పిలుపునిచ్చారు.

మైనంపల్లి హనుమంతరావు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు ఆయనలా నేను దిగజారి మాట్లాడదలచుకోలేదు అలాంటి వారికి మీరు ఓటుతోనే బుద్ధి చెప్పాలని కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మరొకసారి కెసిఆర్ ప్రభుత్వము రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు సీఎం పదవి కోసం హైదరాబాదులో మత కలహాలు సృష్టించారు. కెసిఆర్ పాలనలో హైదరాబాదు ప్రశాంతంగా ఉంది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే కారుకు ఓటేయాలని మంత్రి హరీష్ రావు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news