ఈనెల 18న ఇంటింటికీ కాంగ్రెస్ ‘5 హామీల గ్యారంటీ కార్డులు’

-

తెలంగాణలో పూర్వ వైభవం కోసం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ఫలితాలు పునరావృతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే సమావేశాలు, సభలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 17వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు సీనియర్ నేత సోనియా గాంధీ హాజరవనున్నట్లు సమాచారం. ఈ సభలో సోనియా.. కాంగ్రెస్ గెలిచిన తర్వాత అమలు చేయబోయే 5 ప్రధాన హామీల గ్యారెంటీ పత్రాన్ని విడుదల చేయనున్నారు.

బహిరంగ సభ అనంతరం 18వ తేదీన ఉదయం 11 గంటలకు 119 నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకులు చేరుకుంటారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. స్థానిక నేతలు జాతీయ నేతలతో కలిసి 5 హామీల గ్యారెంటీ కార్డులను ఇంటింటికీ అందజేస్తారని చెప్పారు. ఆ తర్వాత అన్ని నియోజకవర్గాల్లో మీడియా సమావేశాలు పెట్టి హామీలను వివరిస్తారని వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షులతో ఆదివారం సాయంత్రం జూమ్‌ ద్వారా  నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news