సీఎం రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ నేత మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

-

సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానెల్ తో ఆయన బుధవారం మాట్లాడారు. కాంగ్రెస్ లో మాదిగలకు అన్యాయం జరుగుతోందన్నారు. తమ జాతి హక్కు తమకు ఇవ్వడం లేదన్నారు. కడియం శ్రీహరి ఏ కులమో ఆయనకే తెలియదన్నారు. మాదిగలకు జరిగిన అన్యాయంపై జరగబోయే పరిణామాలకు సీఎం రేవంతే బాధ్యత అన్నారు.

ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. మాదిగలమనే తమపై సీఎం చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ సీట్ల విషయంలో సర్వేలన్నీ బోగస్ అని.. సీఎం ఎవరికి అనుకుంటే వారికే టికెట్ అని ఆరోపించారు. రేపు ఇదే అంశంపై ఒక రోజు దీక్ష చేస్తా అన్నారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని.. పార్టీ మారే ఉద్దేశం లేదని మోత్కుపల్లి క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news