ఈ నెల 9న కరీంనగర్‌ లో బహిరంగ సభ – రేవంత్‌ రెడ్డి

-

ఈ నెల 9న కరీంనగర్‌ లో బహిరంగ సభ నిర్వహిస్తామని టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కరీంనగర్ పోలీస్ కమీషనర్ గా ఒక ఆంధ్రా అధికారిని నియమించారని… కరీంనగర్ లో మేం సభ పెడతామంటే అనుమతులివ్వను అంటున్నాడని ఆగ్రహించారు.

కరీంనగర్ గడ్డ మీద సభ జరగనివ్వకుంటే.. కాంగ్రెస్ శ్రేణులతో కవాతు చేస్తామని.. గంగులకు అనుమతి ఇచ్చి కాంగ్రెస్ సభకు ఎందుకు ఇవ్వరు? అని నిలదీశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ సభకు అనుమతి ఇవ్వనని ఆంధ్రా అధికారి అంటున్నడు..తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నానని పేర్కొన్నారు.

ఈ నెల 9న కరీంనగర్ గడ్డపై కవాతు చేద్దాం తరలి రండి… ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా.. లక్షల మంది బీఆరెస్ కార్యకర్తలు అడ్డు వచ్చినా కరీంనగర్ సభ జరిపి తీరతామని స్పష్టం చేశారు. కాగా ఈ సభకు కాసేపటి క్రితమే… ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news