బీఆర్ఎస్ లోకి 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. నో చెప్పిన కేసీఆర్

-

తెలంగాణ భవన్‌లో కొనసాగుతున్న బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లోకి 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తానని తనతో టచ్ లోకి వచ్చారని తెలిపారు. అయితే తాను దానికి నో చెప్పినట్లు వెల్లడించారు. ఆ పార్టీలోని ఓ కీలక నేత తనను సంప్రదించారని చెప్పారు. కాంగ్రెస్​లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారని అక్కడ అంతా బీజేపీ పెత్తనమే నడుస్తోందని చెప్పారని పేర్కొన్నారు.

 

‘రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగ .. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారు. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారు. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ను  బీజేపీ వాళ్లు బతకనిస్తారా?” అని ప్రశ్నించాడు. కాంగ్రెస్‌కు అధికారం వచ్చింది కదా అని బీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్తే ఇక్కడ అంతా బీజేపీ కథ నడుస్తుందని నాతో ఆ నాయకుడు వాపోయాడు. ఇప్పటికిప్పుడు 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ అని నన్ను సంప్రదించాడు, కానీ ఇప్పుడే వద్దని నేనే చెప్పా – కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత

Read more RELATED
Recommended to you

Latest news