కాంగ్రెస్ పార్టీ కళ్ళు లేని కబోదిలా వ్యహారిస్తుంది : కేటీఆర్

-

పదేళ్ల లో చేసిన అభివృద్ధి కనిపిస్తుంటే.. కళ్ళు లేని కబోదిలా కాంగ్రెస్ పార్టీ వ్యహారిస్తుంది అని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో నాయకులకు , కార్యకర్తలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడే ట్రైలర్ స్టార్ట్ అయింది, కేసీఆర్ ప్రజా క్షేత్రంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీకి సినిమా స్టార్ట్ అవుతుంది.

సినిమా స్టార్ట్ కావడం ఎన్నో రోజులు పట్టదు, ఫిబ్రవరి నుండే స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేసేంత వరకు ప్రజల తరుపున పోరాటం చేయాలి. 5 యేండ్లు పాటు మనం కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల పుస్తకంను బైబిల్, ఖురాన్, భగవద్గీత లాగ చదవి అవి అమలు చేసేంత వరకు వదలొద్దు. నా రాజకీయ జీవితంలో ఒక్క నెల మాసంలోని ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఒక్క కాంగ్రెస్ మాత్రమే. ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, గెలుపులు సహజం. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంను కాంగ్రెస్ పార్టీ కరపత్రంలా మాట్లాడించారు.కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేయించారు అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news