టీఎస్‌ఎండీసీ వైస్‌ ఛైర్మన్‌ మల్సూర్‌పై బదిలీ వేటు.. ఐఏఎస్ మహేశ్‌ దత్‌కు అదనపు బాధ్యతలు

-

తెలంగాణ రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌  లిమిటెడ్‌ వైస్‌ చైర్మన్‌ & మేనేజింగ్ డైరెక్టర్‌ జీ మల్సూర్‌  ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌గా ఆయనకు పోస్టింగ్‌ ఇచ్చింది.

అదేవిధంగా తెలంగాణ ఇండస్ట్రీస్‌ & కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా ఉన్న 1995 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి బెన్హూర్‌ మహేశ్‌ దత్‌ ఎక్కాకు తెలంగాణ రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌  లిమిటెడ్‌ వైస్‌ చైర్మన్‌ & మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మహేశ్ దత్‌ ఆ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ పేరు మీదుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ శాంతి కుమారి మీడియాకు ఓ  ప్రకటన ద్వారా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news