ఖమ్మంలో కొలిక్కి వచ్చిన కాంగ్రెస్ సీట్లు..!

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ నలుగురు, ఐదుగురు అభ్యర్థులు మినహా మిగతా వారిని బీఆర్ఎస్ ప్రకటించలేదు. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల కసరత్తులోనే కనిపిస్తోంది. కొంత మందిని కాంగ్రెస్  తొలి జాబితా రేపు ప్రకటించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. ఖమ్మంలో కాంగ్రెస్ కీలక నేతల సీట్లు మాత్రం ఓ కొలిక్కి వచ్చాయి. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయనుండగా.. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఈ సీట్లు ఖరారయ్యాయి. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇవాళ భేటీ అయ్యారు. పార్టీలో చేరిన తరువాత ఆయన రాహుల్ తో భేటీ కావడం ఇదే మొదటిసారి. సుమారు అరగంట పాటు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితుల గురించి వివరించినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో పరిస్థితులు, రాజకీయ వ్యూహంపై కూడా చర్చించారు. తుమ్మలతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీని కలిసిన తరువాత ఈ ఇద్దరూ నేతలకు ఈ సీట్లపై స్పష్టమైన హామీ వచ్చిందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. 

 

Read more RELATED
Recommended to you

Latest news