పురుషులకే కరోనా ముప్పు ఎక్కువ… చెప్పిన తెలంగాణా సర్కార్…!

-

తెలంగాణాలో కరోన కేసులు రోజుతో పోలిస్తే నేడు చాలా వరకు తక్కువగానే నమోదు అయ్యాయి. వెయ్యి కేసుల లోపే నమోదు అయ్యాయి తెలంగాణాలో. 983 మందికి మాత్రమే గత 24 గంటల్లో కరోనా సోకింది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణా సర్కార్ ఒక లెక్క విడుదల చేసింది. ఈ లెక్క ప్రకారం తెలంగాణాలో కరోనా సోకిన పురుషుల శాతం 65.6 గా ఉండగా మహిళల శాతం 34.4 గా ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

coronavirus

31 నుంచి 40 ఏళ్ళ లోపు వారే ఎక్కువగా కరోనా బారిన పడ్డారు అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కేసులు యువకుల్లోనే ఎక్కువగా నమోదు అవుతున్నాయి అని పేర్కొంది. దీనితో ఇప్పుడు పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని, అవసర౦ అయితే మినహా బయటకు రావొద్దు అని హెచ్చరిస్తున్నారు. కేసులు ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి అని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news