టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కరోనా..ఈసారి ఆయనే!

-

కరోనా వైరస్‌ తన ప్రతాపాన్ని కొనసాగిస్తుంది..మహమ్మారి తగ్గినట్లే తగ్గి విజృంభణ కొనసాగిస్తోంది..సామాన్యులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు.. ముఖ్యంగా ప్రజలతో మమేకమయ్యే ప్రజాప్రతినిధులను ఎక్కువ ప్రభావితం చేస్తుంది..తాజాగా మరో తెలంగాణ ఎమ్మెల్యేను అటాక్ చేసింది..తాజాగా, మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు.మల్కాజ్‌గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది..ఎమ్మెల్యే మైనంపల్లి తన నివాసంలోనే హోంక్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు..గత వారం రోజులుగా తనను కలిసినవారు విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి కోరారు..వారంతా తప్పని సరిగా హోంక్వారంటైన్లో ఉండాలని సూచించారు..కాగా,ఇటీవల ఆయన తన కుమారుడి ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొన్నారు.. ఆ వేడుకలోనే ఆయనకు కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు..కాగా, మైనంపల్లి పలువురు ప్రముఖులను కలిసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనను కలిసిన వారికి కూడా కరోనా టెన్షన్ పట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news