సీపీఐ జాతీయ మహాసభలకు తెలంగాణ సీఎం కేసీఆర్

-

సీపీఐ జాతీయ మహాసభలకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే.. మరోసారి విజయవాడ కు తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో సీపీఐ జాతీయ మహా సభలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర సీఎం కెసిఆర్ కు సీపీఐ జాతీయ నేతల ఆహ్వానం అందింది.

దీంతో మూడేళ్ళ క్రితం విజయవాడ కు వెళ్ళిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. వచ్చే నెలలో కూడా విజయవాడకు వెళ్లున్నారు. అంతేకాదు.. కేరళ, బీహార్ సీఎంలతో పాటు 20 దేశాలకు చెందిన కమ్యూనిస్ట్ నేతలకు ఆహ్వానం అందించారు సీపీఐ నేతలు. ఈ సభలో.. మోడీ సర్కార్‌ కు వ్యతిరేకంగా… కార్యచరణ రూపొందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news