నల్లగొండలో దారుణం…బావతో మహిళ శృంగారం.. అడ్డుగా ఉన్న భర్తను !

-

నల్లగొండలో దారుణం చోటుచేసుకుంది. బావతో మహిళ శృంగారం.. అడ్డుగా ఉన్న భర్తను సుపారి హత్య చేయించింది భార్య. జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. మిర్యాలగూడ మండలం తుంగపాడు లావుడి తండాకి చెందిన ధారవత్ రాగ్యకు పెద్దఊర మండలంకు చెందిన రోజాతో 2010లో వివాహం, ఇద్దరు పిల్లలు సంతానం ఉంది. మూడేళ్లుగా హైదరాబాద్ లో నివాసం, అక్కడే వరుసకు బావ అయిన లకపతితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఘర్షణలు జరిగాయి.

 

నల్గొండ జిల్లా నెరేడుగొమ్మ మండలంలోని బుగ్గతాండ కు చెందిన మాన్సింగ్, బాలాజీలకు 20 లక్షలతో సుపారి హత్యకు ఒప్పందం కుదుర్చుకున్న లక్ పతి…ఆగస్టు 19న హైదరాబాద్ నగర శివారులో మద్యం తాగించి రాగ్యను హత్య చేశారు. నెరేడుగొమ్మ మండలం కాసరాజపల్లి పుష్కరఘాట్ సమీపంలో కృష్ణా నదిలో రాగ్య మృతదేహాన్ని పడేసారు సుపారి నిందితులు. ఇక రాగ్య తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన హైదరాబాద్ పోలీసులు…భార్య ఫోన్ కాల్ డేటా ఆధారంగా విషయం వెలుగులోకి తీసుకువచ్చారు.రాగ్య మృతదేహం కోసం రెండు రోజులుగా గజ ఈతగాళ్లతో కృష్ణా నదిలో వెతుకుతున్నారు పోలీసులు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news